యాదాద్రి (Yadadri) క్షేత్రాభివృద్ధిలో భాగంగా గిరిప్రదక్షిణ దారిని భక్తులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వైటీడీఏ చర్యలు చేపట్టింది. భక్తులు కొండచుట్టూ ప్రదక్షిణలు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రదక్షిణ దారిలో రక్షణ గోడ నిర్మించేందుకు పనులు చేపట్టారు. మరోవైపు కొండకు ఉత్తరముఖంగా భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పచ్చని చెట్లు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
- sudhirmoortik